Published on Jan 17, 2026
Current Affairs
నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ
నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ

భారత నౌకాదళం తన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ వయాశాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జనవరి నెలాఖరుకు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా నౌకాదళ నౌకలకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది. ప్రస్తుతమున్న తక్కువ ఫ్రీక్వెన్సీ ఎల్‌-బ్యాండ్‌తో పాటు, వయాశాట్‌ హై-ఫ్రీక్వెన్సీ కేఏ-బ్యాండ్‌ శాటిలైట్‌ వ్యవస్థను ఇందులో వినియోగించనున్నారు.