Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 1, 2026
Current Affairs
ధ్రువ్‌-ఎన్‌జీ
ధ్రువ్‌-ఎన్‌జీ

పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2025, డిసెంబరు 30న బెంగళూరులో పౌర హెలికాప్టర్‌ ధ్రువ్‌-ఎన్‌జీ (నెక్స్ట్‌ జనరేషన్‌)ను లాంఛనంగా ప్రారంభించారు. మల్టీరోల్, తేలికపాటి ట్విన్‌ ఇంజిన్‌ వ్యవస్థలున్న ఈ హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. పౌర సేవలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర వైద్య సేవలు, ప్రముఖుల ప్రయాణాలు.. ఇలా బహుళ ప్రయోజనాల లక్ష్యంతో దీన్ని రూపొందించారు.