సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి పేరును భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024, డిసెంబరు 15న హైదరాబాద్లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆర్వోఆర్-2024, ధరణి అంశాలపై జరిగిన సమీక్షలో పేరు మార్పు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. అయితే ధరణి పేరు మార్పును అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
* 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.