ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్స్ట్రీట్ జర్నల్’ విడుదల చేసింది.
సంపద నికర విలువ కనీసం 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు) ఉన్న వారిని సూపర్ బిలియనీరుగా సంస్థ పరిగణించింది.
ఈ 24 మందిలో 16 మంది సెంటి బిలియనీర్ల (100 బిలియన్ డాలర్లు/రూ.8.7 లక్షల కోట్ల)ని నివేదిక తెలిపింది.
వీరందరి సంపద విలువ కలిపితే 3.3 లక్షల కోట్ల డాలర్లని, ఫ్రాన్స్ జీడీపీకి ఇది సమానమని పేర్కొంది.
ఇందులో మనదేశం నుంచి ముకేశ్ అంబానీ (90.6 బి.డాలర్లు), గౌతమ్ అదానీ (60.6 బి.డాలర్లు)కి చోటు దక్కింది.