Published on Aug 29, 2025
Current Affairs
దేశ రక్షణకు హిమ, ఉదయగిరి
దేశ రక్షణకు హిమ, ఉదయగిరి

స్వీయ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరిలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2025, ఆగస్టు 26న జాతికి అంకితం చేశారు.

తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్‌యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇండో-పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పీ-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో కోల్‌కతా, ముంబయిలలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది.