Published on Dec 24, 2024
Current Affairs
దేశంలో వలసల తగ్గుముఖం
దేశంలో వలసల తగ్గుముఖం

దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనావేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 45,57,87,621 మంది వలస వెళ్లినట్లు తేల్చగా, 2023 నాటికి ఆ సంఖ్య 40,20,90,396కి తగ్గినట్లు పేర్కొంది.

2011తో పోలిస్తే ఇది 11.78% తక్కువ అని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు 37.64% ఉండగా, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది 28.88%కి పడిపోయినట్లు వెల్లడించింది. 

గతంతో పోలిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, మౌలికవసతులు, అనుసంధానతలాంటి సేవలు పెరగడం, ఆర్థిక అవకాశాలు మెరుగుపడటం వలసలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థికసలహా మండలి అభిప్రాయపడింది.