దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పదినెలల్లో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ఉత్పత్తిమార్గాల్లో కలిపి నికరంగా 52,537 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం పెరిగినట్లు వెల్లడించింది. ఇందులో 39,657 మె.వా. పునరుత్పాదక ఇంధనం ఉన్నట్లు తెలిపింది. అందులోనూ 34,955 మె.వా. సౌర, 4,613 మె.వా. పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది.