Published on May 29, 2025
Current Affairs
దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె
దేశంలో తొలి జన్యు సవరణ గొర్రె

జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు.