Published on Jun 9, 2025
Current Affairs
దేశంలో అత్యంత పేదరికం 5.3 శాతం
దేశంలో అత్యంత పేదరికం 5.3 శాతం

భారత్‌లో అత్యంత పేదరిక (ఎక్స్‌ట్రీమ్‌ పావర్టీ) రేటు వేగంగా తగ్గి 5.3 శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది.

2011-12లో ఇది 27.1 శాతం కాగా, దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది.

రోజుకు 3 డాలర్ల (రూ.255) కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్న వారిగా ప్రపంచ బ్యాంక్‌ నిర్వచించింది.

2021లో ఈ పరిమితి 2.15 డాలర్లుగా ఉంది. సవరించిన తర్వాత 15 శాతం పెంచి 3 డాలర్లుగా చేసింది.

అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న వారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. 

2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్న వారు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గారు.

2024లో 3 డాలర్ల పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44 శాతంగా ఉంది.