భారత్లో అత్యంత పేదరిక (ఎక్స్ట్రీమ్ పావర్టీ) రేటు వేగంగా తగ్గి 5.3 శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
2011-12లో ఇది 27.1 శాతం కాగా, దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది.
రోజుకు 3 డాలర్ల (రూ.255) కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్న వారిగా ప్రపంచ బ్యాంక్ నిర్వచించింది.
2021లో ఈ పరిమితి 2.15 డాలర్లుగా ఉంది. సవరించిన తర్వాత 15 శాతం పెంచి 3 డాలర్లుగా చేసింది.
అయినప్పటికీ మన దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న వారు బాగా తగ్గారని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
2021 పరిమితి ప్రకారం చూస్తే అత్యంత పేదరికంలో ఉన్న వారు 16.2 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గారు.
2024లో 3 డాలర్ల పరిమితి వద్ద అత్యంత పేదరిక రేటు 5.44 శాతంగా ఉంది.