Published on Aug 29, 2025
Current Affairs
దేశంలోనే తొలి స్మార్ట్‌ వర్సిటీ
దేశంలోనే తొలి స్మార్ట్‌ వర్సిటీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్‌ వర్సిటీగా నిలిచింది. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ ఎస్‌ఏ.కోరి 2025, ఆగస్టు 25న వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణం, తరగతి గదులు, వసతి గృహాల్లో అత్యాధునిక వసతులు సమకూర్చామని, వీటిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల వర్చువల్‌గా ప్రారంభించారని తెలిపారు.