దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును ‘సున్నా’కు ప్రభుత్వం 2024, సెప్టెంబరు 17న సవరించింది. సెప్టెంబరు 18 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద ఈ విండ్ఫాల్ పన్నును ప్రభుత్వం విధిస్తోంది. రెండు వారాల్లో చమురు ధరల సరాసరి ఆధారంగా 15 రోజులకోసారి ఈ పన్నును ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.