పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో దిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన బ్రెయిన్ స్టెంట్ను రూపొందించింది. దీనిపై ప్రత్యేక క్లినికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సాధనానికి సూపర్నోవా స్టెంట్ అని పేరు పెట్టారు. గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ ఈ సాధనాన్ని అభివృద్ధి చేసింది. దీనిపై గ్రాస్రూట్ పేరిట ప్రయోగాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8 కేంద్రాల్లో వీటిని చేపట్టారు. దీనికి దిల్లీ ఎయిమ్స్ జాతీయ సమన్వయ కేంద్రంగా వ్యవహరించింది. ఈ సాధనాన్ని ప్రత్యేకంగా భారత్లోని భిన్న విభాగాల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.