మనదేశంలో అధునాతన హెవీ వెయిట్ టార్పెడో (నీటిలో ప్రయాణించే మిసైల్)లను ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీస్.. అంతర్జాతీయ ఆయుధ దిగ్గజ సంస్థ టీకేఎంఎస్తో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ 2 సంస్థల భాగస్వామ్య సంస్థ, మనదేశంలో అధునాతన హెవీ వెయిట్ టార్పెడోలను ఉత్పత్తి చేస్తుంది. వాటిని భారత నౌకాదళంలోని జలాంతర్గాములకు సరఫరా చేయడంతో పాటు, విదేశాలకూ ఎగుమతి చేస్తారు.