దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత ఆతిశీ 2024, సెప్టెంబరు 21న రాజ్నివాస్లో ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా సమక్షంలో ఆమెతో పాటు మంత్రులుగా అయిదుగురు ఆప్ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు.
షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత దిల్లీ సీఎం పదవి చేపట్టిన మూడో మహిళగా ఆతిశీ నిలిచారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 17వ మహిళ ఆమె. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారే ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అరుదైన అవకాశం ఆతిశీకి లభించింది.