Published on Sep 18, 2024
Current Affairs
దిల్లీ కొత్త సీఎం ఆతిశీ
దిల్లీ కొత్త సీఎం ఆతిశీ

దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా  ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకురాలు ఆతిశీ మార్లేనా సింగ్‌ (43) ఎన్నికయ్యారు. 2024, సెప్టెంబరు 17న జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌), సుష్మా స్వరాజ్‌ (భాజపా) తర్వాత దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ నిలిచారు. 

* ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వంలో 14 శాఖలను ఆమె నిర్వహిస్తున్నారు. దిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.