2025, ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ భాజపా అభ్యర్థులు 48 చోట్ల (45.56 ఓట్ల శాతం) విజయం సాధించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 43.57 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 6.34శాతం ఓట్లు సాధించినా ఒక్క స్థానంలోనూ గెలవలేదు.
ఆప్ 12 ఏళ్ల పాలనకు (2013-25) తెరపడటంతో పాటు, 27 ఏళ్ల తర్వాత దిల్లీలో భాజపా అధికారంలోకి వచ్చింది.