దేశ ద్రవ్యలోటు 2025 డిసెంబరు చివరకు రూ.8.55 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు, జీడీపీలో 4.4% లేదా రూ.15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ అంచనాల్లో తాజా గణాంకాలు 54.5 శాతానికి సమానం. 2024-25 ఇదే సమయంలో ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యంలో 56.7 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాల ప్రకారం..
2025 డిసెంబరు చివరకు ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 72.2 శాతానికి సమానం. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల రూపేణ, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా లభించింది. రుణ రహిత పెట్టుబడి సాధనాల్లో రూ.46,047 కోట్లు సమకూరాయి.