ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి నాలుగు నెలలు (ఏప్రిల్- జులై) ముగిసేనాటికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.2,76,945 కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఇది 17.2%.
* గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే సమయానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలో 33.9 శాతంగా ఉంది.