వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ 2024, అక్టోబరు 15న శంకుస్థాపన చేశారు. ఈ రాడార్ స్టేషన్ను 2,900 ఎకరాల్లో రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.
క్లిష్టమైన ఆపరేషన్లలో సాయుధ దళాల కమాండ్ సెంటర్లు, నౌకలు, జలాంతర్గాముల మధ్య సురక్షితమైన రియల్టైం కమ్యూనికేషన్కు ఇది దోహదపడుతుంది.