Published on Oct 17, 2024
Current Affairs
దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌
దామగుండంలో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీప్రాంతంలో వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2024, అక్టోబరు 15న శంకుస్థాపన చేశారు. ఈ రాడార్‌ స్టేషన్‌ను 2,900 ఎకరాల్లో రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.

క్లిష్టమైన ఆపరేషన్లలో సాయుధ దళాల కమాండ్‌ సెంటర్లు, నౌకలు, జలాంతర్గాముల మధ్య సురక్షితమైన రియల్‌టైం కమ్యూనికేషన్‌కు ఇది దోహదపడుతుంది.