గుజరాత్లోని దీన్దయాల్ పోర్ట్ అథారిటీలో ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్మెంట్/ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 65.
వివరాలు:
1. మేనేజ్మెంట్ ట్రైనీ- 35 (యూఆర్-19, ఎస్సీ-05, ఎస్టీ-02, ఓబీసీ-09)
2. గ్రాడ్యుయేట్ ట్రైనీ- 30 (యూఆర్-17, ఎస్సీ-04, ఎస్టీ-02, ఓబీసీ-07)
విభాగాలు: హెచ్ఆర్/ ఫైనాన్స్ మార్కెటింగ్, కంప్యూటర్ అప్లికేషన్, అకౌంటెన్సీ, లీగల్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టికల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ(ఇంటర్), ఎల్ఎల్బీ ఉత్తీర్ణత, మూడు నెలల కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ తదితరాల్లో) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు మేనేజ్మెంట్ ట్రైనీకి రూ.25,000; గ్రాడ్యుయేట్ ట్రైనీకి రూ.20,000.
వయోపరిమితి: 01.06.2025 నాటికి మేనేజ్మెంట్ ట్రైనీ 28 ఏళ్లు; గ్రాడ్యుయేట్ ట్రైనీ 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04-07-2025.
చిరునామా: ఆఫ్లైన్ దరఖాస్తులను ది సెక్రటరీ, దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, గాంధీదామ్(కచ్చి), గుజరాత్ చిరునామాకు పంపించాలి.