కేంద్ర ప్రభుత్వం 2024, సెప్టెంబరు 30న భరతీయ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆయన హిందీలో వందల చిత్రాల్లో నటించారు. 1976లో ‘మృగయ’తో నటుడిగా పరిచయమైన ఆయన 370కుపైగా చిత్రాల్లో నటించారు. 2024 ఆరంభంలో మిథున్కు ‘పద్మభూషణ్’ పురస్కారం దక్కింది.
* 2024, అక్టోబరు 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.