దేశంలో కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తిగా గుర్తించిన హరీశ్ రాణా (31) 2026, మార్చి 24న దిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. 13 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడి సుదీర్ఘ కోమాలోకి వెళ్లిపోయిన హరీశ్కు సుప్రీంకోర్టు కారుణ్య మరణం ప్రసాదిస్తూ మార్చి 11న చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. నిబంధనల ప్రకారం అతడికి చికిత్సను నిలిపివేయడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.