Published on Jun 14, 2025
Current Affairs
తల్లికి వందనం పథకం
తల్లికి వందనం పథకం

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ పథక నిధులను 2025, జూన్‌ 13న కూటమి ప్రభుత్వం విడుదల చేసింది.

67,27,164 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున చెల్లించేందుకు రూ.10,090.74 కోట్లు అందిస్తారు.

దానిలో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

గత ప్రభుత్వం 42,61,965 మందికి అమ్మఒడి అమలుచేస్తే... ప్రస్తుతం 24,65,199 మందికి అదనంగా అందిస్తున్నారు.