అంగన్వాడీ చిన్నారులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. పిల్లలకు పోషకాహారం అందితేనే వారి శారీరక, మానసిక ఎదుగుదల బలంగా ఉంటుంది. సరైన ఆహారం లభించకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి . ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లోని ఆరేళ్లలోపు చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.