తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు.
వివరాలు:
పరీక్ష పేరు: ఈఎంఆర్ఎస్ సెలెక్షన్ టెస్ట్(ఈఎంఆర్ఎస్ఎస్టీ)- 2025
సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి.
అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో 5వ తరగతి చదివి ఉండాలి. లేదా ఇంటివద్దనే ఐదో తరగతి చదివిన వారు కూడా అర్హలే. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయోపరిమితి: మార్చి 31, 2025 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్ల మధ్య ఉండాలి. 31.03.2012 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ (50 ప్రశ్నలు), అరిథ్మెటిక్ (25 ప్రశ్నలు), తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16-02-2025.
ప్రవేశ పరీక్ష నిర్వహణ: 16.03.2025.
పరీక్ష ఫలితాల ప్రకటన: 31.03.2025.
మొదటి దశ ప్రవేశాలు: 31.03.2025.
Website:https://tsemrs.telangana.gov.in/
Apply online:https://telanganaemrs.cgg.gov.in/TGEMRSWEB/