తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రాణి కుముదినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024, సెప్టెంబరు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఈమె పదవిలో ఉంటారు. ఈ పదవి నిర్వర్తించిన పార్థసారథి సెప్టెంబరు 9న పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో రాణి కుముదిని నియమితులయ్యారు.
* 1988 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2023 జులైలో పదవీ విరమణ పొందారు.