Published on Sep 18, 2024
Current Affairs
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి రాణి కుముదినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024, సెప్టెంబరు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఈమె పదవిలో ఉంటారు. ఈ పదవి నిర్వర్తించిన పార్థసారథి సెప్టెంబరు 9న పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో రాణి కుముదిని నియమితులయ్యారు. 

*  1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2023 జులైలో పదవీ విరమణ పొందారు.