యువత ఆన్లైన్లో జూదం ఆడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 18 ఏళ్ల లోపు వారు డబ్బు చెల్లించి ఆన్లైన్ గేమ్లు ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిషేధం విధించింది.
ఆన్లైన్ జూదంలో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్ల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా ఆన్లైన్ గేమ్లను క్రమబద్ధీకరించేలా నిబంధనలను కఠినతరం చేస్తూ గేమింగ్ అథారిటీ 2025, ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు 18 ఏళ్ల లోపువారు ఆన్లైన్లో నగదు చెల్లించి ఆడేందుకు నిషేధం విధించింది.
అదేవిధంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్లైన్ గేమ్లు ఆడకూడదని స్పష్టం చేసింది.