దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Schedule-I, January-2025) వెలువడింది. ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21,413 (ఆంధ్రప్రదేశ్లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి.)
వివరాలు:
గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు
సర్కిల్ వారీగా ఖాళీలు:
1. ఆంధ్రప్రదేశ్- 1,215
2. అస్సాం- 555
3. బిహార్- 783
4. ఛత్తీస్గఢ్- 638
5. దిల్లీ - 30
6. గుజరాత్- 1,203
7. హరియాణా- 82
8. హిమాచల్ప్రదేశ్- 331
9. జమ్మూ అండ్ కశ్మీర్- 255
10. జార్ఖండ్- 822
11. కర్ణాటక- 1,135
12. కేరళ- 1,385
13. మధ్యప్రదేశ్- 1,314
14. మహారాష్ట్ర- 1,498
15. నార్త్ ఈస్ట్రన్- 1,260
16. ఒడిశా- 1,101
17. పంజాబ్- 400
18. రాజస్థాన్- 2718
19. తమిళనాడు- 2,292
20. తెలంగాణ- 519
21. ఉత్తర్ ప్రదేశ్- 3,004
22. ఉత్తరాఖండ్- 568
23. పశ్చిమ్ బెంగాల్- 923
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 03.03.2025.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 06.03.2025 నుంచి 08.03.2025 వరకు.