2025లో భారతదేశ కర్బన ఉద్గారాల పెరుగుదల గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినట్లు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ (సీఆర్ఈఏ) తన నివేదికలో పేర్కొంది. 2020 కొవిడ్ సమయంలో నమోదైన తగ్గుదలను మినహాయిస్తే.. 2021 తర్వాత ఇదే అతితక్కువ వార్షిక పెరుగుదల అని సీఆర్ఈఏ వెల్లడించింది.
2025 ద్వితీయార్థంలో కర్బన ఉద్గారాల పెరుగుదల కేవలం 0.5 శాతం ఉండగా.. ఏడాది మొత్తంమీద చూసినా అది 0.7శాతమే.