మానవసహిత అంతరిక్ష యాత్ర- గగన్యాన్ కోసం ‘రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ’ (డీఆర్డీవో) అత్యంత బలీయమైన రిబ్బన్ పారాచూట్లను తయారు చేసింది. దీని పరీక్షను చండీగఢ్లోని ‘టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాల’ (టీబీఆర్ఎల్)లో విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణమంత్రిత్వ శాఖ 2026, ఫిబవ్రరి 19న వెల్లడించింది. డ్రోగ్ పారాచూట్ ఎంత భారాన్ని తట్టుకుంటుందనే పరీక్షను పూర్తిచేయడం ముఖ్యమైన పరిణామమని పేర్కొంది.