Published on Oct 17, 2024
Current Affairs
డబ్ల్యూటీఎస్‌ఏ - 2024
డబ్ల్యూటీఎస్‌ఏ - 2024

నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్‌ టెలికమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్‌ఏ)-2024ను దిల్లీలోని భారత్‌ మండప్‌లో ప్రధాని మోదీ 2024, అక్టోబరు 15న ప్రారంభించారు. దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎమ్‌సీ) 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు.

టెలికాం, సంబంధిత సాంకేతికత విషయంలో ముందుకెళుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఇక్కడ 120 కోట్ల మంది మొబైల్‌ వినియోగదార్లు, 95 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదార్లున్నారు. మొత్తం ప్రపంచంలో 40 శాతానికి పైగా డిజిటల్‌ లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నాయి అని మోదీ పేర్కొన్నారు.