టాటా స్టీల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.వి.నరేంద్రన్ వరల్డ్స్టీల్ అసోసియేషన్ (ప్రపంచ ఉక్కు సంఘం) ఛైర్మన్గా ఎన్నికయ్యారు. జేఎస్డబ్ల్యూ గ్రూపు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ తర్వాత భారత్ నుంచి ఈ పదవికి ఎన్నికైన రెండో వ్యక్తిగా నరేంద్రన్ నిలిచారు. ఆ సంస్థకు 17 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ సభ్యుడిగా నరేంద్రన్ నియమితులయ్యారు.