దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిస్థితులపై టెలికం విభాగం ఆర్థిక పరిశోధన యూనిట్ టెలికం గణాంకాలు-2024 పేరిట నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రస్తుతం దేశంలో టెలి, మొబైల్ఫోన్ల సంఖ్య 119.80 కోట్లకు చేరింది. అంటే ప్రతి వందలో 85.65 శాతం మందికి టెలిఫోన్ సౌకర్యం ఉంది. మొబైల్ వినియోగదారుల్లో 68.19 శాతం మంది ఇంటర్నెట్, డేటా వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టెలికం వినియోగదారులు 8.6 కోట్ల మంది ఉన్నారని, ఇక్కడ ప్రతి వంద మందిలో 94.73 టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడించింది.