Published on Sep 1, 2025
Current Affairs
ట్రిపుల్‌ ఐటీ (డీఎం) ప్రాంగణం
ట్రిపుల్‌ ఐటీ (డీఎం) ప్రాంగణం

అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో ‘ఇన్‌స్టిట్యూషన్స్‌’ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని ట్రిపుల్‌ ఐటీ (డీఎం) ప్రాంగణం తొమ్మిదో స్థానంలో నిలిచింది.

2024, నవంబరులో సింగపూర్‌లో ‘వరల్డ్‌ ఆర్కిటెక్చర్‌ ఫెస్టివల్‌-2024’ నిర్వహించారు.

అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 760 సంస్థలు పోటీపడ్డాయి.

అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించారు.

కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో రూ.254 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ట్రిపుల్‌ఐటీ కళాశాల(డీఎం) ప్రాంగణాన్ని నిర్మించారు.