కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) జనవరి 2025లో ప్రారంభం కానున్న పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. పీహెచ్డీ ప్రోగ్రాం (ఫుల్/ పార్ట్ టైం)- జనవరి 2025
2. ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్డీ ప్రోగ్రాం
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్, యూజీసీ- జేఆర్ఎఫ్/ నెట్/ సీఎస్ఐఆర్/ డీఏఈ-జెస్ట్/ ఇన్స్పైర్ ఫెలోషిప్లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22/12/2024.
రాత పరీక్ష, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 24/12/2024.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 30/12/2024.
ఫలితాల ప్రకటన: 01/01/2025.
Website:https://iiitk.ac.in/
Apply online:https://iiitk.ac.in/Ph.D.-Admission/page