Published on Feb 15, 2025
Current Affairs
ట్రంప్‌తో మోదీ భేటీ
ట్రంప్‌తో మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఫిబ్రవరి 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు.

ఈ సందర్భంగా శత్రుభీకరమైన ఎఫ్‌-35 యుద్ధవిమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది.

అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోళ్లను పెంచడంతోపాటు 26/11 ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వూర్‌ రాణాను భారత్‌కు అప్పగించడం లాంటి పలు నిర్ణయాలు వెలువడ్డాయి. 

ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా 50 వేలకోట్ల డాలర్లకు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని రెండు దేశాలూ ప్రకటించాయి.