ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఫిబ్రవరి 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వాషింగ్టన్లో సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు.
ఈ సందర్భంగా శత్రుభీకరమైన ఎఫ్-35 యుద్ధవిమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది.
అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతోపాటు 26/11 ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్కు అప్పగించడం లాంటి పలు నిర్ణయాలు వెలువడ్డాయి.
ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా 50 వేలకోట్ల డాలర్లకు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని రెండు దేశాలూ ప్రకటించాయి.