చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు మత్స్యకారులు ఎదుర్కొంటోన్న ముప్పులను తగ్గించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ట్రాన్స్పాండర్’ అనే కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
ఇది ఒక ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రత వ్యవస్థ.
ఈ టెక్నాలజీని పశ్చిమ బెంగాల్లోని కాక్ద్వీప్ సబ్డివిజన్లో తాజాగా ప్రారంభించారు.
ఆ పరికరాన్ని ప్రారంభ దశలో 300 పడవల్లో ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అన్ని ట్రాలర్లలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ యోచిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?..
ట్రాన్స్పాండర్ పరికరం మొబైల్ నెట్వర్క్పై ఆధారపడదు. నేరుగా ఉపగ్రహానికి అనుసంధానమై ఉంటుంది.
తద్వారా మత్స్యకారులు సముద్రంలోని ఏ మూల నుంచి అయినా తీరప్రాంత అధికారులకు అత్యవసర సందేశాలను పంపగలరు.