అంతర్జాతీయ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చోటు దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ట్రేడవుతున్న అగ్రగామి 30 కంపెనీల్లో భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక సంస్థగా రిలయన్స్ నిలిచింది.
‘ట్రెండ్స్- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పేరిట ఈ నివేదికను వెలువరించారు.
అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
మొదటి 8 స్థానాల్లో అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు- మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా ప్లాట్ఫామ్స్, టెస్లా, బ్రాడ్కామ్ ఉన్నాయి.
9వ స్థానంలో తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ, ఆ తర్వాతి స్ధానంలో చైనా సంస్థ టెన్సెంట్ నిలిచాయి.
జాబితాలో 216 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18.4 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ 23వ స్థానం దక్కించుకుంది.