భారత సైన్యానికి చెందిన మొదటి తరం ‘పినాక మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ (ఎంఎల్ఆర్ఎస్)’, బ్యాటరీ కమాండ్ పోస్టులను ఆధునికీకరించేందుకు, మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏసీఎల్) దక్కించుకుంది. 2026, జనవరి 6న దిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారత సైన్యం నుంచి ఈ ఆర్డర్ అందుకున్నట్లు టీఏసీఎల్ తెలిపింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా, సైన్యంలోని 510 అడ్వాన్స్ బేస్ వర్క్షాప్ (ఏబీడబ్ల్యూ), టాటా సంస్థ సంయుక్తంగా పనిచేయనున్నాయి.