తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్-2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
వివరాలు:
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025
గ్రూపులు, సీట్లు: ఎంపీసీ- 1,496, బైపీసీ- 1,440, ఎంఈసీ- 60.
మొత్తం సీట్ల సంఖ్య: 2,996.
అర్హత: 2025 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్; బైపీసీకి ఇంగ్లిష్, బయాలజీ, ఫిజికల్ సైన్స్; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 23-04-2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 10/05/2025.
మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే నాలుగో వారంలో