Published on Apr 2, 2025
Current Affairs
‘టైగర్‌ ట్రంప్‌-25’ విన్యాసాలు
‘టైగర్‌ ట్రంప్‌-25’ విన్యాసాలు

భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్‌ ట్రంప్‌-2025’ సముద్ర విన్యాసాలు 2025, ఏప్రిల్‌ 1న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతను పెంపొందించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. 

‘ఐఎన్‌ఎస్‌ జలశ్వ’ నౌకపై విన్యాసాలు ప్రారంభం కాగా.. ముగింపు వేడుకలు ఏప్రిల్‌ 13న కాకినాడ తీరాన అమెరికా నౌక ‘యూఎస్‌ఎస్‌-కాంస్టాక్‌’పై జరగనున్నాయి.