Published on Oct 7, 2025
Current Affairs
టీఎస్‌టీఎల్‌కు విశిష్ట గుర్తింపు
టీఎస్‌టీఎల్‌కు విశిష్ట గుర్తింపు

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌లో నడుస్తున్న టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ (టీఎస్‌టీఎల్‌)కు విశిష్ట గుర్తింపు లభించింది. దేశంలో 5జీ నెట్వర్క్, యాక్సెస్, మొబిలిటీ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌ (ఏఎంఎఫ్‌), 5జీ గ్రూప్‌-1 పరికరాలను పరీక్షించడానికి టీఎస్‌టీఎల్‌ను అధికారిక ప్రయోగశాలగా కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్‌ విభాగం ధ్రువీకరించింది. ఇలా గుర్తింపు పొందిన మొదటి ల్యాబ్‌ ఇదే. ఈ ధ్రువీకరణ 5జీ మొబైల్‌ టెలికాం పరికరాల అత్యాధునిక భద్రతా అంచనాలను దేశీయంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.