Published on May 14, 2025
Current Affairs
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్‌ ఖన్నా 2025, మే 13న పదవీ విరమణ చేశారు.

2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.

2024, నవంబరు 11న భారతదేశ 51వ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.

1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. కుటుంబంలో మూడో న్యాయమూర్తి.

తండ్రి దేవరాజ్‌ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, పెదనాన్న హెచ్‌.ఆర్‌.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.