ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్కు అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో మానవహక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ప్యానెల్కు ఆయన నేతృత్వం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితి దీన్ని ఏర్పాటు చేసింది.
ఇజ్రాయెల్, ‘ఆక్రమిత పాలస్తీనా ప్రాంతం’లో మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరపడం ఈ ప్యానెల్ ప్రధాన బాధ్యత. ఈ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్కు గతంలో బ్రెజిల్ న్యాయనిపుణుడు పాలో సెర్గియో పిన్హీరో నేతృత్వం వహించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణపై జస్టిస్ మురళీధర్ ఇవ్వబోయే నివేదికలకు చాలా ప్రాధాన్యం ఉండనుంది.