భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎ.ఎస్.ఓక్ కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు.
మాజీ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీ విరమణతో ఈ కొలీజియంను పునరుద్ధరించాల్సి వచ్చింది.
ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎ.ఎస్.ఓక్ సభ్యులుగా ఉండే కొలీజియం సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది.