బయోకాన్ గ్రూప్ ఛైర్పర్సన్ కిరణ్ మజందార్ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్జీ టాటా పురస్కారం దక్కింది. మన దేశంలో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (ఐఎస్క్యూ) ఈ అవార్డును ప్రకటించింది. 2004లో ఐఎస్క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్క్యూ వార్షిక కాన్ఫరెన్స్ 2024లో కిరణ్కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు.