భారత వెయిట్లిఫ్టర్ జోష్న సబర్ యూత్ ఆసియా ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం నెగ్గింది.
2024, డిసెంబరు 20న దోహాలో జరిగిన యూత్ బాలికల 40 కేజీల విభాగంలో జోష్న 135 కిలోలు (స్నాచ్ 60 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 75 కేజీలు) బరువులెత్తి సరికొత్త రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.
యూత్ బాలికల 45 కేజీలలో పాయల్ 155 కిలోలు (70+85) బరువులెత్తి బంగారు పతకం సాధించింది.
జూనియర్ బాలికల 45 కేజీల విభాగంలో పాయల్, యూత్ బాలుర 49 కేజీలలో బాబూలాల్ హేమ్బ్రోమ్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.