కేంద్ర క్యాబినెట్ 2024, సెప్టెంబరు 18న పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది.
దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు:
* దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు దేశంలోని అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిగాయి. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్ పేర్కొంది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది.
జమిలిని సాధ్యం చేయడంలోని సవాళ్లు
* దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
* రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. పార్లమెంటుతోపాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు.. అంటే 14 రాష్ట్రాలకుపైగా జమిలికి అంగీకరించాలి. ప్రస్తుతం భాజపా సారథ్యంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో (భాజపా సొంతంగా 13 రాష్ట్రాల్లో) అధికారంలో ఉంది.