కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా(54) ప్రమాణం చేశారు. 2024, అక్టోబరు 16న శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో అయిదుగురు మంత్రులతోనూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు.
జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టడం అబ్దుల్లాకు ఇది రెండో సారి. జమ్మూకశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.