Published on Dec 21, 2024
Current Affairs
జేపీసీ ఛైర్‌పర్సన్‌గా పీపీ చౌధరి
జేపీసీ ఛైర్‌పర్సన్‌గా పీపీ చౌధరి

జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి రాజస్థాన్‌ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వం వహించనున్నారు.

2024, డిసెంబరు 20న స్పీకర్‌ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పీపీ చౌధరి రాజస్థాన్‌లోని పాళి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

2025 బడ్జెట్‌ సమావేశాల చివరి వారం తొలిరోజు తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు.